సింగరేణి కార్మికుడు మృతి

Singareni worker dies: బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న కుంట రాములు బ‌స్తీ ఏరియాలో ఉన్న వాగులో ప‌డి ఓ సింగ‌రేణి కార్మికుడు మృతి చెందాడు. పోగుల సంతోష్ అనే కార్మికుడు శ‌నివారం రాత్రి ఈ కుంట‌లో ప‌డి మ‌ర‌ణించాడు. సంతోష్ స్వ‌స్థ‌లం కొమురం భీమ్ జిల్లా రెబ్బ‌న మండ‌లం గోలేటి. అయితే అత‌ని మృతికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌రాలేదు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

You might also like