మీడియా అక్రిడియేష‌న్ల‌ గ‌డువు పొడిగింపు

Media Accreditation : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడియేష‌న్ల గ‌డువు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ గ‌డువు మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో అక్రిడేష‌న్ కార్డుల గడువు ముగియ‌నుంది. ఈ గ‌డువు మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగిస్తున్న‌ట్లు ఐ అండ్ పీఆర్ అధికారులు పేర్కొన్నారు. అక్టోబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు అక్రిడియేష‌న్ల గ‌డువు పొడిగిస్తూ ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లకు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like