ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం
బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో బాయిజమ్మ ,సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం దాతలు కోల గోపాల్-హేమలత, నాగసాయి, కామాక్షి లక్ష్మి సహకారంతో గర్భిణులు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకుదు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు.
సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్,పోతురాజుల తిరుపతి కాడపాక మహేందర్, స్రవంతి, మీడియా సిబ్బంది ఫేరోజ్ తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.