పిడుగుప‌డి రైతు మృత్యువాత‌

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు పడి ఓ రైతు మృత్యువాత‌ప‌డ్డాడు. జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పొలంలో ప‌నిచేస్తున్నాడు. త‌ను ప‌నిచేస్తుండ‌గా పొలంలోనే ఒక్క‌సారిగి పిడుగుప‌డ‌టంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

You might also like