ముగ్గురి ప్రాణం తీసిన చేప‌ల వేట‌

Fishing that claimed three lives: చేప‌ల వేట ముగ్గురి ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు పొచ్చ‌ర వాగులో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లారు. చీర‌తో చేప‌లు ప‌డుతుండ‌గా ఒక వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో ప‌డిపోయాడు. దీంతో అత‌న్ని కాపాడేందుకు వెళ్లిన మిగ‌తా ఇద్ద‌రు సైతం గ‌ల్లంత‌య్యారు. దీంతో స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొద‌ట జాల‌ర్లు ఒక్కరి మృత దేహం బయటకు తీశారు. ఆ త‌ర్వాత మరో రెండు మృత దేహాలను సైతం జాలర్లు, డీడీఆర్ ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. ముగ్గురి మృతి తో విషాదం నెల‌కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like