తమ్ముడు తమ్ముడే..
సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!

Notices to CM Revanth’s brother’s house:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో పరిగెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఆక్రమల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుకు అక్రమార్కులు వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరి భవనం ముందు బుల్డోజర్లు వస్తాయోనని షేకవుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేస్తామని తేల్చిచెప్పారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా ఆక్రమణల్లో ఉన్నాయని తేలితే చర్యలు తప్పవన్నారు.
రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/ తహసీల్దార్.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా… ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చి, ఎఫ్టీఎల్ను ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం గమనార్హం. బుధవారం ఒక్కరోజే దుర్గం చెరువు పరిసరాల్లోని నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద తాఖీదులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. దీంతో ఆ కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి జీహెచ్ఎంసీ వేసిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ను గుర్తించినా.. ఎటువంటి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో వంద ఎకరాలకుపైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, సర్వే తర్వాత దాని విస్తీర్ణం 84 ఎకరాల్లోనే ఉందని నిర్దారించారు.దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.