శ్రీరామ్ సాగర్ 40 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరికి వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తుండడంతో ఒక లక్ష 50వేల క్యూసెక్కుల చొప్పున వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు ఈ సీజన్లో ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టానికి చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.