దాడి చేసింది కుక్కలే

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయపల్లి వద్ద లేగదూడ పై దాడి చేసింది కుక్కలే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బుధవారం సాయంత్రం లేగదూడ పై ఓ జంతువు దాడి చేసిందని అది పులి అయి ఉండవచ్చు అని గ్రా భావించారు. అడవిలో నీలాయపల్లి వస్తున్న ఇద్దరు యువకులు రక్తం మరకలతో ఉన్న లేగదూడను చూసి పరుగులు తీశారు.

ఈ మధ్య కాలంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంతో పాటు చిరుతలు కూడా తిరుగుతుండటంతో అవి ఏవైనా దాడి చెసి ఉండవచ్చని భావించారు. ఈ రోజు ఉదయం డిప్యూటీ రేంజ్ అధికారి జాడి తిరుపతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దూడను ఆసుపత్రికి తరలించి పశువైద్యాధికారి ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. మండలంలో పులి సంచారం లేదని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయ‌న వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like