పోషణ పక్షం పక్కాగా అమలు చేయాలి

పోషణ్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్ సెక్టార్ కార్యక్రమం మేర భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జీ డీడబ్ల్యువో నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్షం పక్కాగా అమలుచేస్తూ తల్లిబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లి పాలు మాత్రమే పట్టించాలని.. అలా ఇవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత జిల్లా సమన్వయ కర్త సౌజన్య, పోషన్ అభియాన్ రజిత, శ్యామల, సూపర్వైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.