అతడి శరీరంలో 42 బుల్లెట్లు

కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్రావుపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారో తెలుస్తుంది. కాగా మధుసూదన్రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్(Kashmir) అందాలను చూడటానికి వెళ్లి ఉగ్రదాడిలో మృతి చెందాడు.
మధుసూదన్ కు ఇద్దరు పిల్లలు
నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ తల్లిదండ్రులు సోమిశెట్టి తిరుపాలు (Somishetty Tirupal), పద్మావతి (Padmavathi) నివసిస్తున్నారు. మధుసూదన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూమార్తె మధు ఇంటర్ చదువుతుండగా.. కుమారుడు దత్తు 8వ తరగతి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ కుటుంబంతో కలిసి తాజాగా జమ్ము కశ్మీర్ టూర్. కు వెళ్లారు. దురదృష్టవశాత్తు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పలువురి సంతాపం..
ఉగ్రదాడుల్లో తమ జిల్లా వాసి చనిపోవడంతో మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుసూదన్ మరణవార్త తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. అతడి బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మధుసూదన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం (AP Govt) అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ఉగ్రదాడి పిరికపందల చర్య అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.