సీఎం యోగి కంటతడి..

CM Yogi Emotional : పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ యోగి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరుపెట్టుకున్నారు.
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది ఒకరు. భార్యతో కలిసి శుభం వివాహరయాత్రకు పహల్గామ్కు వచ్చి ఉగ్రతూటాలకు బలయ్యారు. శుభంకు రెండు నెలల కిందటే వివాహం జరిగింది. శుభం.. ముష్కురుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రతిఒక్కరినీ కలిచి వేసింది. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర భావోద్వేనికి గురయ్యారు. కన్నీరు పెట్టున్నారు. ఉగ్రమూకల దాడిలో అమరుడైన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ సీఎం వెళ్లారు. సీఎంను చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరుగా విలపించారు. శుభం తండ్రిని ముఖ్యమంత్రి ఓదార్చారు. తప్పుకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా. శుభం ఇంటికి సీఎం యోగా వెళ్లగానే అక్కడ ఒక ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. సీఎంను చూడగానే శుభం కుటుంబసభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ‘ఉగ్రమూకల దాడిలో నా భర్త మరణించాడు.. సార్ మేము ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాం’ అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఐష్ణయ చెప్పిన మాటలతో యూపీ సీఎం కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయారు. యూపీ సీఎం యోగీ.. శుభం ఇంటి నుంచి కన్నీరు పెట్టుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.