కాంటాక్ట్ కార్మికుల జీతాలు పెంచాల్సిందే..
-జేఏసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు టీబీజీకేఏస్ మద్దతు
-మేడే రోజు ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి
-టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు

TBGKS: చాలాకాలం నుండి కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోలేటిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్రాజ్ శ్రీనివాస్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు లేకపోతే జీ ఓ నెంబర్ 22 ప్రకారం కానీ నెలకు రూపాయలు రూ. 25,000 తగ్గకుండా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మే డే సందర్భంగా స్వయానా కార్మిక మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపుదల, ఈఎస్ఐ వైద్య సౌకర్యం, 2022 సెప్టెంబర్ 26న సెంట్రల్ లేబర్ అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందంలోని విషయాలను అమలు చేయాలని చేస్తున్న పోరాటాలలో టీబీజీకేస్ ప్రత్యక్షంగా పాల్గొంటుందన్నారు. నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మారిన వెంకటేష్, మత్తు సమ్మయ్య పాల్గొన్నారు.