తేనెటీగల దాడిలో ఒకరి మృతి

One person dies in bee attack: తేనెటీగల దాడిలో ఒక కంట్రాక్టర్ కార్మికుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి 1 ఇంక్లైన్ దగ్గర బొగ్గు గని ఆవరణలో నలుగురు కూలీలు పనిచేస్తున్నారు. ఆ గని ఆవరణకు సంబంధించి గోడలు కూలిపోయాయి. ముత్యాల పైడిధర్ అనే కంట్రాక్టర్ దగ్గర వారు పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేశాయి. నలుగురు కూలీలపై తేనెటీగల దాడి చేయగా, ఈ ఘటనలో మాదారం టౌన్షిప్కు చెందిన పుప్పాల నర్సయ్య అనే కార్మికుడు మరణించాడు. ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది.