రఫెల్.. స్కాల్ప్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసింది. ఈ దాడిలో ఉపయోగించిన రాఫెల్, SCALP క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. రాఫెల్ తో పాటు స్కాల్ప్ క్షిపణులు కూడా పాకిస్తాన్పై జరిగిప ఆపరేషన్ సింధూర్లో కీలకపాత్ర పోషించాయి. స్కాల్ప్ (SALP) ఒక డీప్ స్ట్రైక్ క్రూజ్ క్షిపణి. ఇది గాలిలో నుంచి భూమిపై దాడులు చేస్తుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్ష్యాన్ని ఛేదించగల అద్భుతమైన క్షిపణి. గగనతలంలో ఉంటూ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తంగా 300 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించి శత్రువును నాశనం చేసే సమర్థత కలిగింది.
ప్రధానంగా ఈ SCALP క్షిపణులు దాడి చేసిన ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకు గుంతలను చొచ్చుకొని పోగలవు. అంతేకాదు 1300 కిలోమీటర్ల బరువుతో 450 కిలోల పేలోడ్ కలిగి ఉంటుంది. ఐదు మీటర్ల కంటే పొడవు, 63 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రధానంగా ఈ ఆపరేషన్స్ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ప్రధానా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక రాఫెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాడార్కు చిక్కకుండా యుద్ధం చేయడంలో ఈ విమానం ఎంతో ప్రత్యేకత ఉంది. మనదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వద్ద ఈ రాఫెల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక శ్రేణి యుద్ధవిమానాల్లో ఇది ప్రత్యేకంగా చెబుతారు. అటు రాఫెల్, ఇటు స్కాల్ప్ రెండు కలిసి శత్రు దేశాన్ని నిద్రపోకుండా చేస్తున్నాయి.