క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ… ఆత‌డే..

Operation Sindoor:ఎంతో ఖ‌చ్చిత‌త్వంగా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణిచేలా చేసిన దాడిపై ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య పౌరుల‌పై దాడిచేసి 26 మందిని పొట్ట‌న‌పెట్టుకోవ‌డమే కాకుండా, వెళ్లి మీ మోదీకి చెప్పుకోండి అంటూ ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌ల‌కు ధీటుగా స‌మాధానం చెప్పింది. ఇంతకీ ఇంతటి సాహసోపేత ఆపరేషన్‌ను ఎవరు ప్లాన్ చేశారు? దాన్ని అంత కచ్చితంగా ఎలా అమలు చేశారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవ‌రిది…

మ‌న‌దేశంలో ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే దేశ‌మంతా ర‌గిలిపోయింది. పాకిస్తాన్‌పై ఖ‌చ్చితంగా దాడి చేయాల్సిందేనంటూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఏదో ఒక‌టి చేయాల్సిందేనంటూ భార‌త్‌, ఎప్పుడైనా త‌మ దేశంపై దాడి జ‌రుగుతుందంటూ పాకిస్తాన్ స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా నిలిచాయి. అటు మోదీ, ఇటు ర‌క్ష‌ణ శాఖ మంత్రి, త్రివిధ ద‌ళాల స‌మీక్ష‌లు స‌మావేశాలు ఇలా ఉద్రిక్త‌ల న‌డుమ కొద్ది రోజులుగా స‌మాలోచ‌న‌లు కొన‌సాగాయి. దేశంలోని అన్ని ద‌ళాల‌ను అల‌ర్ట్ చేయ‌డ‌మే కాకుండా, వివిధ దేశాల ప్ర‌తినిధులు, ఆయా దేశాల అధినేత‌ల‌కు భార‌త్ ముందుగా విష‌యాన్ని చేర‌వేసింది. చాలా జాగ్ర‌త్త‌గా ప‌క‌డ్బందీగా ఏం చెప్పాలో అది చెప్పేసింది..

అస‌లు సూత్ర‌ధారి అజిత్ ధోవ‌ల్‌.. పాకిస్తాన్ మూల‌మూల‌లు తెలిసిన వ్య‌క్తిగా..
దోవ‌ల్ గూఢాచారిగా పాకిస్తాన్ మొత్తం క‌లియ‌దిరిగారు. ఏ మూల‌న ఏముందో…? ఏ ఉగ్ర‌వాది ఎక్క‌డ దాక్కున్నారో..? ఇలా అన్ని ఆయ‌న‌కు కొట్టిన పిండి. మ‌రోవైపు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం సేక‌రిస్తూ ఉగ్ర‌వాదుల జాడ‌లు ప‌సిగ‌ట్టి సైన్యాన్ని రంగంలోకి దిగారు. పాకిస్తాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలపై అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజామున నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేశారు. రాత్రి 1.28 నిమిషాలకు దాడికి సిద్ధమంటూ ట్వీట్ చేసిన భారత ఆర్మీ 1.51 నిమిషాలకు పని ముగించేసింది. కేవ‌లం 25 నిమిషాల్లో పాకిస్తాన్‌లోని 21 ప్రాంతాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో మొత్తం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు.

ఆపరేష‌న్ సింధూర్ ప‌ర్య‌వేక్షించిన మోదీ
పాకిస్థాన్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం వేకువజామున భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్‌లో ఉండి భారత ఆర్మీకి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. మరోవైపు ఈ దాడి వివరాలను భారత ఉన్నతాధికారులు.. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్‌పై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు.

ఇలా సామాన్యుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా, అనుకున్న ల‌క్ష్యం చేర‌డంలో దిట్ట‌గా పేర్కొందిన అజిత్ దోవ‌ల్ తాను ఎందుకు ప్ర‌త్యేక‌మో ఈ ఆప‌రేష‌న్ ద్వారా మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like