ఇక ఆప‌రేష‌న్ సింధూర్-2

ఆప‌రేష‌న్ సింధూర్ ఇంత‌టితో ఆగిపోలేదా..? అది ఇంకా కొన‌సాగుతుందా…? ఈ దాడుల త‌రువాత పాకిస్తాన్ ఏం చేస్తుంది…? భార‌త్ జ‌వాబు ఎలా ఉండ‌బోతోంది…? ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ దాడులు చేయ‌డంతో పాకిస్తాన్ లోలోప ర‌గిలిపోతోంది. ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చినా తిరిగి కొట్టేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది. ఆప‌రేష‌న్ సింధూర్ 2 పేరుతో అన్ని ప్ర‌ణాళిక‌లు ర‌చించింది…

కాశ్మీర్‌లోని ప‌హాల్గాంలో ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో దాడులు చేసింది. భారత్ మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్ భూభాగం, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని 9 ఉగ్ర స్థావరాలపై సమర్థవంతంగా క్షిపణి దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు సహా పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్ సిద్దమౌతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైనా దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ జాతీయ భద్రతా మండలి (NSC) ప్రకటనలో హెచ్చరించింది. బుధవారం ఉదయం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది..?
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంద‌నేది ప్ర‌శ్నార్త‌కంగా మారింది. వాస్త‌వానికి భార‌త్‌పై దాడి చేయ‌డం కానీ, యుద్దం చేసేంత శ‌క్తి, సాహ‌సం పాకిస్తాన్ వ‌ద్ద లేద‌నేది నిర్వివాదాంశం. పాకిస్తాన్‌లో చాలా మంది ప్ర‌జ‌లు కూడా యుద్దాన్ని కోరుకోవ‌డం లేదు. భార‌త్ తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల పాకిస్తాన్ ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతోంది. సింధూ జ‌లాల న‌దీ ఒప్పందం నిలిపివేత‌, మందుల స‌ర‌ఫ‌రా బంద్ ఇలా కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తోంది. యుద్ధం అంటూ వ‌స్తే దారుణ‌మైన ప‌రిస్థితులు చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ యుద్ధం చేయ‌క‌పోతే కొన్ని వ‌ర్గాల నుంచి వ‌చ్చే ఒత్తిళ్లు త‌ట్టుకోవ‌డం క‌ష్టం అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే పాకిస్తాన్ ఏం చేస్తుంద‌నేది భార‌త్ నిశితంగా గ‌మ‌నిస్తోంది.

ఆప‌రేష‌న్ సింధూర్-2 ప్ర‌ణాళిక‌లు సిద్ధం..
ఒక‌వేళ పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చినా ప్ర‌తిస్పందించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది. అలా సిద్ధ‌మ‌య్యే ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభించింది. యుద్ధం వ‌చ్చినా సిద్ధ‌మ‌య్యేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు యుద్ధ‌నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ యుద్ధం సంభ‌విస్తే జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలను పూర్తిగా చ‌ర్చించాకే రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బ్లూ ప్రింట్ రూపొందించిన‌ట్లు స‌మాచారం. పాకిస్తాన్ నేరుగా దాడి చేయ‌క‌పోయినా ఉగ్ర‌వాదుల ద్వారా దేశంలోని రైల్వే వ్య‌వ‌స్థ నాశ‌నం చేసేలా ప్లాన్ చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి. ఇంకా చాలా చోట్ల స్లీప‌ర్ సెల్‌ను ఆక్టివేట్ చేస్తున్న‌ట్లు గ‌మ‌నించారు. ఇలా అన్నింటిని గుర్తిస్తూ యుద్ధం సిద్ద‌మ‌య్యి ఆప‌రేష‌న్ సింధూర్-2 ప్ర‌ణాళిక‌లు రూపొందించి భార‌త్‌..

Get real time updates directly on you device, subscribe now.

You might also like