మంచి దోస్త్… ముంచే దోస్త్..

నీ స్నేహితుడు ఎవరో చెప్పు.. నువ్వు ఎలాంటి వాడివో చెప్తా అనేది ఓ నానుడి.. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశం సత్తా, పాకిస్తాన్ డొల్లతనం ఇలా ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత దోస్తులు ఎలా ఉండాలి..? ఎలా ఉంటే మనకు మేలు జరుగుతుంది..? మంచి దోస్త్ ఎవరు..? ముంచే దోస్త్ ఎవరు..? అనే విషయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
భారత వైమానిక దళాలు మే 7న చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను షేక్ చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో పాటు పాకిస్తాన్ లోపలే కొన్ని కీలకమైన ప్రాంతాల్లో భారత దళాలు ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించాయి. కానీ పాక్ వైమానిక రక్షణ వ్యవస్థ మాత్రం ఈ దాడులను ముందుగానే గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ సంఘటనతో చైనా నుండి కొనుగోలు చేసిన రాడార్ వ్యవస్థల పనితీరుపై మరోసారి తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. చైనా తయారు చేసిన పాక్ రాడార్ వ్యవస్థలు భారత వైమానిక దళాల కదలికలను సమయానికి గుర్తించలేకపోయాయి. ఇది తొలి సారి కాదు. 2019లో బాలాకోట్పై భారత్ నిర్వహించిన వైమానిక దాడిని కూడా పాక్ రక్షణ వ్యవస్థలు ముందుగా పసిగట్టలేకపోయాయి. ఈ రక్షణ వ్యవస్థ మొత్తం చైనా నుంచే కొనుగోలు చేయడం గమనార్హం.
ఆ రెండు దేశాలు మునిగినట్లే..?
పాకిస్తాన్ తనను తాను దెబ్బతీసుకోవడమే కాదు.. చైనా సైనిక ఎగుమతులను కూడా కోలుకోలేని దెబ్బతీసింది అదెలాగా అంటారా..! భారత్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించడంలో చైనా HQ9 పూర్తిగా విఫలమైంది. ప్రత్యేకంగా క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి రూపొందించిన చైనీస్ HQ-9 SAMలు మొన్న రాత్రి “ఆపరేషన్ సిందూర్” లో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని కూడా గుర్తించలేక పోవడం విశేషం. పాకిస్తాన్ భారత్ ని ఎదుర్కొటానికి ఒక్కో యూనిట్కు $3 మిలియన్లు ఖర్చు చేసి చైనా దగ్గర కొనింది. వాటిలో ఏవీ పని చేయలేదు కదా కనీసం కొన్ని స్టార్ట్ కూడా అవ్వలేదంట. దీంతో టర్కీ, సెర్బియా తో సహా చైనాతో చాలా దేశాలు చేసుకున్న ఆయుధ ఒప్పందాలను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పాకిస్తాన్ను ఎగదోసిందే చైనా..
వాస్తవానికి భారత్ను ఎదిరించే సత్తా పాకిస్తాన్ ఏ కోశానా లేదు. కానీ ఆసియా ఖండంలో భారత్ ఎదుగుతుండటంతో చాలా విషయాల్లో తమను దాటిపోవడం చైనాకు ఏ మాత్రం ఇష్టం లేదు. భారతదేశం ఈ పది సంవత్సరాల్లో అత్యద్భుత ప్రగతి సాధిస్తోంది. సరిహద్దుల్లో తన మాట కూడా చెల్లడం లేదు. దీంతో నేరుగా భారతదేశంతో పెట్టుకుని భంగపడ్డ చైనా ఇక పరోక్షంగా పాకిస్తాన్ను రంగంలోకి దించింది. తన వద్ద ఉన్న ఆయుధాలు పాకిస్తాన్ అమ్మడమే కాకుండా భారత్పైకి ఎగదోసింది. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశంలోకి పంపడం ఆ తర్వాత మన దేశం పాకిస్తాన్పై దాడి చేస్తే కనీసం ఆ దేశంలో ఉన్న చైనా రక్షణ వ్యవస్థ పనిచేయకపోవడంతో, చైనా మంచి స్నేహితుడు కాదని, ముంచే స్నేహితుడని పాకిస్తాన్కు ఆలస్యంగా అర్థమయ్యింది.
మన వెన్నంటే మన నేస్తం…
ఇక భారత్కు ఏ కాలంలో అయినా వెన్నంటి ఉండే నేస్తం ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఇజ్రాయిల్.. ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిన తర్వాత మొదటగా అండగా నిలబడింది ఆ దేశమే. మీరు ముందుకు వెళ్లండి.. మీ వెంట మేమున్నామంటూ ప్రోత్సహించింది.. అది కేవలం ఈ ఘటనలోనే కాదు.. మొదటి నుంచి భారత్కు బాసటగా నిలిచిన దేశం. 1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ అప్పట్లో భారత్కు మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి మోర్టార్ల వంటి పరికరాలను కూడా ఇచ్చింది. మనతో ఎన్నో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, అధునాత యుద్ధ పరికాలు, రాడార్లు ఇలా ఎన్నో రకాలుగా భారత్కు మంచి మిత్రదేశంగా నిలిచింది. ఆ దేశం అండతో మనకు ఎంతో మేలు జరిగింది.
ఇలా మనతో ఉండే మిత్రుడు మంచివాడైతే మనం విజయాలు సాధిస్తాం.. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాం.. ముంచే వాడైతే అందరి ముందు పరువు తీసుకోవడం ఖాయం.