టీజీఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్

TGFDC: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) మంచిర్యాల రేంజ్ జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు. టీజీఎఫ్ డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన జాబితాలో మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యారు. పది సంవత్సరాలుగా ప్లాంటేషన్లను రక్షిస్తూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నందుకు ఈ అవార్డు ప్రకటించారు. శుక్రవారం రాత్రి డివిజన్ కేంద్రమైన కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమం లో డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా సాయికిరణ్ ప్రశంసా పత్రంతో పాటు 5000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. ఈ సందర్బంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, రేంజ్ సిబ్బంది సాయికిరణ్ ను అభిందించారు.